ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయినా కూడా చాలా తక్కువ సినిమాలు చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి.ఈయన కెరీర్ ఆరంభం నుండి కూడా సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు.
మహేష్ బాబు తో మహర్షి సినిమా ను తెరకెక్కించి చాలా గ్యాప్ తీసుకుని గత ఏడాది తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో వారిసు సినిమాను తెరకెక్కించాడు.ఆ సినిమా తెలుగు లో వారసుడుగా విడుదల అయిన విషయం తెల్సిందే.
వారిసు సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.వారసుడు మాత్రం నిరాశ పర్చింది.
మొన్న సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయిన విషయం తెల్సిందే.వంశీ పైడిపల్లి తదుపరి సినిమా ఏంటి అంటూ ఇప్పుడు ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
ఆ మధ్య మహేష్ బాబు తో ఈయన సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి.కానీ త్రివిక్రమ్ సినిమా చేస్తున్న మహేష్ బాబు వెంటనే రాజమౌళి దర్శకత్వం లో సినిమా చేయాల్సి ఉంది.కనుక మూడు సంవత్సరాల వరకు మహేష్ బాబు తో సినిమా సాధ్యం కాదు.అందుకే మహేష్ బాబు తో వంశీ పైడి పల్లి తదుపరి సినిమా అనేది నిజం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వంశీ పైడిపల్లి మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు.ఇప్పటి వరకు వంశీ పైడిపల్లి తదుపరి సినిమా ఏంటీ అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ చర్చలు జరుపుతున్నాడు అంటూ సమాచారం అందుతోంది.ఈ ఏడాదిలో వంశీ సినిమా మొదలు పెడతాడా లేదా అనేది చూడాలి.గత సినిమాల మాదిరిగానే వంశీ పైడిపల్లి తదుపరి సినిమాకు కూడా ఏళ్లకు ఏళ్ల సమయం తీసుకుంటాడా అనేది చూడాలి.