దర్శకుడు వి.ఎన్ ఆదిత్యా అంటే అందరికి వెంటనే గుర్తుకొచ్చే సినిమా మనసంతా నువ్వే.
ఉదయ్ కిరణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి.ప్రేమ కథ చిత్రాలలో ఓ కొత్త ఒరవడి తీసుకొచ్చిన ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వి.ఎన్ ఆదిత్యా తరువాత నాగార్జునకి నేనున్నాను సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు.అలాగే ఉదయ్ కిరణ్ కి శ్రీరామ్ అనే ఒక ఎవరేజ్ సినిమా కూడా ఇచ్చాడు.
అయితే ఆ తరువాత ఈ దర్శకుడు చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.మొదటి సినిమా రేంజ్ లో తరువాత సినిమాలు చేయలేకపోయాడు.అతను చివరిగా ముగ్గురు అనే చిన్న సినిమాతో వచ్చాడు.ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.
మరల తొమ్మిదేళ్ళ గ్యాప్ తర్వాత కొత్తవాళ్లతో ఓ చిన్న సినిమాతో మరోసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.ఈ సినిమాకి లత్కోరు లవ్వింతే అనే డిఫరెంట్ టైటిల్ పెట్టాడు.
ఈ సినిమా ద్వారా ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్నాడు.పాత దర్శకులు మరల తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళ్ళీ ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుంటున్నారు.
ఇక నాగార్జున లాంటి స్టార్ హీరోతో సినిమా చేసి తరువాత ఫెయిల్యూర్ బాటలో వెళ్లి చిన్న సినిమాతో వస్తున్న వి.ఎన్ ఆదిత్యా తన ఎంట్రీని ఎలా చూపిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.