టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తాజాగా అరవింద సమేత చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ను దక్కించుకున్న విషయం తెల్సిందే.100 కోట్ల షేర్ను దక్కించుకున్న అరవింద సమేత అద్బుతమైన రికార్డులు ఎన్నో తమ ఖాతాలో వేసుకుంది.ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్ను అందించిన త్రివిక్రమ్ నందమూరి అభిమానులకు తిరుగులేని బహుమతిని దసరా కానుకగా ఇచ్చాడు.ఎన్టీఆర్ సినీ కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్లు అయితే వచ్చాయి.
కాని ఎప్పటి నుండో ఊరిస్తూ వస్తున్న 100 కోట్ల మూవీని మాత్రం త్రివిక్రమ్ ఇచ్చాడు.తన సినిమాల్లో యాక్షన్ను ఓ రేంజ్లో పెట్టే త్రివిక్రమ్ తాను చాలా సెన్సిటివ్ అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
తన సినిమాల్లో పిల్లలను ఏడిపించడం, వారిని ఇబ్బంది పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు.అందుకే అత్తారింటికి దారేది చిత్రంలో చిన్న కుర్రాడి తల్లి చనిపోయినట్లుగా చూపించాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లాడిని ఏడిపించకుండా, కేవలం అతడిని సీరియస్ గా ఉంచి, వర్షం ఎఫెక్ట్ పెట్టి, ఏడుస్తున్నట్లుగా ఫీల్ వచ్చేలా చేశాను.పిల్లల విషయంలో ఇతర సినిమాల్లో అయినా కఠినంగా చూపిస్తే నేను తట్టుకోలేను అంటూ త్రివిక్రమ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఆమద్య నయనతార హీరోయిన్గా వచ్చిన ‘కర్తవ్యం’ సినిమాలో పాప బోరుగుంటలో పడ్డది చూపించారు.
అంతా బాగుందని అంటే ఆ సినిమా చూడాలని అనుకున్నారు.కాని పదిహేను నిమిషాలు చూసిన తర్వాత పాప పడే ఇబ్బందికి నేను సినిమా చూడలేక పోయాను.
వెంటనే సినిమా ఆఫ్ చేశాను అంటూ తన సున్నిత మనస్థత్వంను చెప్పుకొచ్చాడు.
ఆడవారి విషయంలో తన సినిమాల్లో చాలా జాగ్రత్తగా ఉంటానని, ఎక్కడ ఆడవారిని అవమానించేలా ఉండకుండా జాగ్రత్తగా ఉంటాను అంటూ త్రివిక్రమ్ అన్నాడు.రేప్ సీన్స్ ను తన సినిమాల్లో అస్సలు పెట్టను అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.పైకి కఠినంగా కనిపించే త్రివిక్రమ్ మరీ ఇంత సెన్సిటివా అంటూ ఆయన అభిమానులు కూడా నోరెళ్లబెడుతున్నారు.