మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా రూపొందాల్సి ఉంది.గత ఏడాది నుండి ఈ సినిమా ను అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు.
ముందుగా అనుకున్న ప్రకారం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు డేట్లు ఇస్తే త్రివిక్రమ్ మొదలు పెట్టాలని అనుకున్నాడు.మహేష్ కూడా రెండు సినిమా లను సమాంతరంగా చేసి కొద్ది తేడా తో విడుదల చేయాలని భావించాడు.
కాని పరిస్థితులు అనుకూలించలేదు.మరీ దారుణంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మహేష్ బాబు నుండి త్రివిక్రమ్ కు డేట్లు ఇవ్వలేదు.దాంతో మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబోలో సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.2020 సంవత్సరంలో అల వైకుంటపురంలో సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆయన నుండి సినిమా లు వచ్చిందే లేదు.
త్రివిక్రమ్ గట్టిగా అనుకుంటే ఎవరో ఒక పెద్ద హీరోతో ఇప్పటి వరకు సినిమా తీసి వదిలే అవకాశం ఉంది.కాని ఆయన మాత్రం చూద్దాం.చేద్దాం అన్నట్లుగా ఉన్నాడు.ఆయన సినిమా లకు దర్శకత్వం వహించకున్నా కూడా చిల్లర పనులతో చాలానే వెనకేసుకుంటున్నాడట.ఆమద్య వచ్చిన డీజే టిల్లు మొదలుకుని త్వరలో ప్రారంభం కాబోతున్న పవన్ వినోదయ్య సిత్తం రీమేక్ వరకు ఎన్నో సినిమా లకు స్క్రిప్ట్ వర్క్ లో స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ లో సహకరిస్తున్నాడు.ఆ మద్య భీమ్లా నాయక్ సినిమా కు కూడా తనవంతు సహకారం అందించిన విషయం తెల్సిందే.
కాని త్రివిక్రమ్ నుండి సినిమా లు ఎందుకు రావడం లేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సినిమా లకు దర్శకత్వం చేయకుండా ఈ చిల్లర పనులు ఎందుకు గురు గారు అటూ కొందరు విమర్శలు చేస్తున్నారు వారికి ఏం సమాధానం ఇస్తాడో చూడాలి.