టాలెంటెడ్ దర్శకుడు తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో కంప్లీట్ గా తన స్టైల్ మార్చుకున్నారు.ఎస్టాబ్లిష్ హీరోలతోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నెక్స్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ తో సీత మూవీ తెరకెక్కించాడు.ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
అయినా కూడా రానా దగ్గుబాటితో ఒక సినిమాకి కమిటై ఉన్నాడు.అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి అభిరామ్ ని హీరోగా పరిచయం చేసే బాద్యత తీసుకున్నాడు.
వీటితో పాటు గోపీచంద్ తో అలువేలు వెంకటరమణ మూవీ ఉంది.ఈ మూవీలో కీర్తి సురేష్ గోపీచంద్ కి జోడీగా కనిపించనుంది.
సాయి పల్లవిని ముందుగా స్మప్రదించిన ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో కీర్తి సురేష్ ని ఖరారు చేశారు.
ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ మూవీ స్టార్ట్ చేశాడు.ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.ఇదిలా ఉంటే ఇప్పుడు తేజ గోపీచంద్, కీర్తి సురేష్ అలివేలు వెంకటరమణ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసేశాడు.
ఆగష్టులో మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు.లాక్ డౌన్ నుంచి సడలింపులు రాగానే వర్క్ స్టార్ట్ చేసి ఆగష్టు నాటికి సెట్స్ పైకి వెళ్ళిపోవాలని తేజ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీని వీలైనంత వేగంగా పూర్తి చేసి అభిరామ్ తో మూవీని కూడా ఎనౌన్స్ చేయాలని చూస్తున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.