టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు.తేజ దర్శకత్వంలో చిత్రం సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ కిరణ్ కు చిత్రం సినిమా విజయంతో వరుస అవకాశాలు వచ్చాయి.
తొలి సినిమా దర్శకుడైన తేజ దర్శకత్వంలోనే ఉదయ్ కిరణ్ రెండో సినిమా నువ్వు నేను తెరకెక్కింది.ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించి ఉదయ్ కిరణ్ రేంజ్ ను మరింత పెంచింది.
ఆ తరువాత మనసంతా నువ్వే సినిమాతో ఉదయ్ కిరణ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.నిజానికి సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా సక్సెస్ కావడం అంత సులభమైన విషయం కాదు.
కానీ ఉదయ్ కిరణ్ మాత్రం ప్రతిభతో పాటు అదృష్టం కలిసివచ్చి హీరోగా సక్సెస్ సాధించాడు.అయితే హీరోగా ఉదయ్ కిరణ్ కు తొలి అవకాశం ఎలా వచ్చింది.? అనే ప్రశ్నకు సమాధానంగా దర్శకుడు తేజ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
దర్శకుడు తేజ తాను 1991లోనే చిత్రం సినిమా కథను తయారు చేసినట్టు చెప్పారు.
అనుకోని కారణాల వల్ల ఆ సినిమాను 2000 సంవత్సరంలో మొదలు పెట్టాల్సి వచ్చిందని.హీరో ఫ్రెండ్ గా ఉదయ్ కిరణ్ ను తీసుకోగా హీరోగా చేస్తానన్న వ్యక్తి కొన్ని కారణాల వల్ల చేయనని చెప్పడంతో ఉదయ్ కిరణ్ కు అవకాశం దక్కినట్టు వెల్లడించారు.
అలా ఆ వ్యక్తి పరోక్షంగా ఉదయ్ కిరణ్ హీరో కావడానికి కారణమయ్యాడని చెప్పారు.
నువ్వు నేను సినిమాకు కూడా తొలుత మాధవన్ ను హీరోగా అనుకున్నామని అయితే కొన్ని కారణాల వల్ల మాధవన్ ఆ సినిమాలో నటించడానికి అంగీకరించకపోవడంతో ఉదయ్ కిరణ్ కు అవకాశం వచ్చిందని తెలిపారు.
అయితే కెరీర్ మొదట్లో వరుస విజయాలను అందుకున్న ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు ఫ్లాప్ కావడం, ఇతర కారణాల వల్ల 2014లో ఆత్మహత్య చేసుకున్నారు.