డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి ఇప్పటితరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకున్నా 15 సంవత్సరాల క్రితం ప్రేక్షకులకు అత్యంత సుపరిచితమైన దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి.యమలీల, శుభలగ్నం, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆహ్వానం లాంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి.
ఒక మాస్ సినిమాల వైపు కాకుండా కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక సినిమా చరిత్రలో ఒక పేజీ క్రియేట్ చేసుకున్నాడు.అయితే తాజాగా సింగర్ సునీతపై ఎస్వీ కృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
తాజాగా డ్రామా జూనియర్స్ షోలో సింగర్ సునీత, రేనూ దేశాయ్ తో పాటు గెస్ట్ గా ఎస్వీ కృష్ణా రెడ్డి హాజరయ్యారు.అయితే ఈ డ్రామా జూనియర్స్ షోలో పిల్లలు ఓ స్కిట్ లో ఎస్వీ కృష్ణా రెడ్డి, సింగర్ సునీత, రేనూ దేశాయ్ లను ఇమిటేట్ చేస్తూ నటించడం జరిగింది.
అయితే ఈ సందర్బంగా ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ మాఘమాసం సినిమా పాటను సింగర్ సునీత పాడిందన్న విషయం తెలిసిందే.అయితే ఆ పాట అడిషన్ సమయంలో సునీత మా ఇంటికి వచ్చినప్పుడు నా కూతురులా అనిపించిందని ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు.