ధృవ, సైరా నరసింహారెడ్డి చిత్రాలను తెరకెక్కించి సక్సెస్లను దక్కించుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి తదుపరి చిత్రం కోసం గత ఏడాది కాలంగా కుస్తీ పడుతూనే ఉన్నాడు.స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ను పొందినా కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు ఎవరు కూడా ఆసక్తిగా లేరు.
ఈ సమయంలోనే సురేందర్ రెడ్డి చిన్న హీరోలతో సినిమాలకు ప్రయత్నాలు చేస్తున్నాడు.మొదట వరుణ్ తేజ్ పేరు ప్రముఖంగా వినిపించింది.
కాని ఆయనతో సినిమా లేదని క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం రామ్ మరియు రవితేజలతో ఈ దర్శకుడు చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
వీరిద్దరు కూడా వేరు వేరు ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు.స్టార్ హీరోలు ఇప్పటికే సురేందర్ రెడ్డికి ఇప్పట్లో డేట్లు ఇవ్వలేమంటూ చెప్పడంతో చిన్న హీరోలు సైతం ప్రస్తుతంకు డేట్లు లేవంటూ వెయిటింగ్లో సురేందర్ రెడ్డిని ఉంచారట.
కిక్ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ను దక్కించుకున్న సురేందర్ రెడ్డి ఒక హిట్ రెండు ఫ్లాప్స్ అన్నట్లుగా కెరీర్లో వెళ్తున్నాడు.
సైరా సినిమా క్రెడిట్ ఆయనకు దక్కలేదు.అదే సమయంలో ఆ సినిమా విషయంలో వివాదం ఏర్పడటంతో మెగా ఫ్యామిలీతో సున్నం పెట్టుకున్నాడనే పుకార్లు కూడా వచ్చాయి.అవి ఎంత వరకు నిజం అనే విషయంలో క్లారిటీ లేదు కాని ఇప్పుడు సురేందర్ రెడ్డికి మాత్రం ఆఫర్లు కనిపించడం లేదు.
మరో మెట్టు దిగి కొత్త వారితో సురేందర్ రెడ్డి సినిమాను చేసేందుకు సిద్దం అవుతాడేమో చూడాలి.