ప్రస్తుత కాలంలో కొందరు ఎలాగైనా పాపులర్ కావాలని ఉద్దేశంతో సమాజంలో ఫెమ్ కలిగినటువంటి కొందరు ప్రముఖులను టార్గెట్ చేస్తూ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా ఓ దర్శకుడు తనను మోసం చేశాడంటూ ఈ మధ్యకాలంలో పలురకాల వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే ఆ దర్శకుడు ఎవరో కాదు సునిశిత్.
అయితే తాజాగా సునిశిత్ మీడియా ముందుకు వచ్చి టాలీవుడ్ సినీ పరిశ్రమపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా అప్పట్లో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించినటువంటి బలుపు చిత్రంలో కూడా మొదటగా తననే హీరోగా తీసుకున్నారని అంతేగాక కొద్దిరోజులు షూటింగ్ కూడా చేశానని ఆ తర్వాత 45 లక్షల రూపాయలు ముట్టజెప్పి ఆ చిత్రం నుంచి తనను తప్పించారని అన్నారు.ఈ విషయంపై పోలీసులకి కూడా ఫిర్యాదు చేశానని అన్నారు.
అయితే తాజాగా సునిశిత్ యాంకర్ ప్రదీప్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎఫైర్ పెట్టుకున్నాడు అని పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.అంతేగాక ఈ విషయమై తాను ప్రజల ముందుకు తెలియచేసినందుకు గాను తనని యాంకర్ ప్రదీప్ తన స్నేహితుడు అయినటువంటి సుడిగాలి సుధీర్ తో కలిసి జనసేన నాయకులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇప్పటికే వ్యక్తిగతంగా కంప్లైంట్ కూడా ఇచ్చారని అన్నారు.
అంతేకాక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రం లో కూడా మొదటగా తనని తీసుకున్నారని కానీ ప్రిన్స్ మహేష్ బాబుకి లైఫ్ ఇవ్వాలని ఉద్దేశంతోనే ఆ అవకాశాన్ని విడిచి పెట్టి నట్లు కూడా పలు వ్యాఖ్యలు చేశాడు.దీంతో ప్రస్తుతం దర్శకుడు సునిశిత్కి పిచ్చి పట్టిందా ఏంటని, అంతేకాకుండా గత కొద్దికాలంగా టాలీవుడ్ సినీ ప్రముఖులపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు.