యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సాహో.యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇదిలా దర్శకుడు సుజిత్ ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్న నిర్మాతలు అందుకు తగ్గట్లుగానే వర్క్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా తాజాగా ఈ సినిమా యూనిట్ కి షాక్ ఇస్తూ మ్యూజిక్ దర్శకుల త్రయం శంకర్ ఎహసాన్ లాయ్ చిత్రం నుంచి తప్పుకున్నారు.
ఇక తాజాగా ఆ ప్లేస్ లోకి జిబ్రాన్ వచ్చి చేరాడు.
ఇప్పటికే సాహో బ్యాగ్రౌండ్ పై జిబ్రాన్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
దానికి రంజాన్ ని ఎంచుకుంది.ఆ రోజు సాహో నుంచి స్పెషల్ ట్రీట్ గా టీజర్ ని రిలీజ్ చేసే ప్రయత్నంలో దర్శకుడు సుజిత్ ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక రంజాన్ కి టీజర్ వస్తుందని తెలియగానే ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.టీజర్ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరి భారీ అంచనాల మధ్య రెడీ అవుతున్న సాహో సినిమా ఫస్ట్ టీజర్ ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాలి.