గోపీచంద్ హీరోగా రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్గా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లౌఖ్యం’ చిత్రం ఏ స్థాయిలో ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ సంవత్సరం బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచి గోపీచంద్ కెరీర్కు ఊపిరి ఊదింది.
ఆ సినిమాతో దర్శకుడు శ్రీవాస్ ఏకంగా బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.గోపీచంద్తో పాటు బాయిలింగ్ స్టార్గా పృథ్వీ చేసిన హంగామా సినిమా స్థాయిని మరింతగా పెంచింది.
బ్రహ్మానందం, పృథ్వీలు సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించారు.ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ను తీసుకు వచ్చే ఆలోచనలో దర్శకుడు శ్రీవాస్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా ‘లౌఖ్యం’కు సీక్వెల్ స్క్రిప్ట్ను సిద్దం చేసుకుని గోపీచంద్ వద్దకు దర్శకుడు వెళ్లాడు అని, స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే సీక్వెల్లో నటించేందుకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఇక ఈ సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ను హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్రహ్మానందం మరియు పృథ్వీలు ఈ సినిమాలో కూడా కామెడీ పంచబోతున్నారు.ఈ సినిమాను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.‘లౌఖ్యం’ సూపర్ హిట్ అయ్యింది, మరి సీక్వెల్ ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి.