టాలీవుడ్ లో మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.ప్రముఖ దర్శకుడు విజయ భాస్కర్ తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తున్నారని తెలుస్తుంది.
తనయుడి సినిమాను తానే డైరెక్ట్ చేస్తారని టాక్.స్వయంవరం, నువ్వే కావాలి నుండి మసాలా సినిమా వరకు దాదాపు 12 సినిమాలను డైరెక్ట్ చేసిన విజయ భాస్కర్ 2013 నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇక ఇప్పుడు తనయుడి తెరంగేట్రం సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది.
విజయ భాస్కర్ సినిమాలకు త్రివిక్రం రైటర్ గా పనిచేశారు.
నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మల్లీశ్వరి సినిమాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.దాదాపు 10 ఏళ్ల తర్వాత విజయ భాస్కర్ మెగా ఫోన్ పట్టబోతున్నారని తెలుస్తుంది.
అయితే ఈ సినిమాకు త్రివిక్రం సహకారం తీసుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.విజయ భాస్కర్ తనయుడు హీరోగా రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి.
ఇప్పటికే డైరక్టర్స్ తనయులు హీరోలుగా ఎంట్రీ ఇస్తూ అలరిస్తున్నారు.ఆల్రెడీ పూరీ తనయుడు ఆకాశ్ పూరీ ట్రాక్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు విజయ భాస్కర్ తనయుడు కూడా హీరోగా సత్తా చాటాలని చూస్తున్నాడు.