ఇటీవలి కాలంలో చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లు హీరోలు గా కొనసాగుతున్న వారు ఒక ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.అదే తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకు రావడం.
స్టార్ హీరోలు గా సెట్ చేయడం.ఇలా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అని ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలు దర్శకులు కూడా తమ వారసులను ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం చేస్తూ ఉండడం గమనార్హం.
ఇక ఇలా తమ వారసులను పరిచయం చేయడం కోసం సరైన సమయం కథ కూడా ఎంచుకోవడంలో ఎంతోమంది బిజీ అయిపోయారు.ఇక అలాంటి వారిలో ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ శంకర్ కూడా వచ్చి చేరారు.
ఏ దర్శకుడికి సాధ్యం కాని రీతిలో విజువల్ వండర్ సృష్టించడంలో శంకర్ ఎప్పుడూ ముందుంటారు.ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అబ్బుర పరిచాడు శంకర్.ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను తెరకెక్కించి భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచారు.ఇక ఇప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు శంకర్.
ఇకపోతే ఈ దర్శకుడు మరికొన్ని రోజుల్లో తన తనయుడు అర్జీత్ ని హీరోగా పరిచయం చేయబోతున్నాడట.అయితే దీనికి సంబంధించి ఎప్పుడో ప్లాన్ వేసుకున్న శంకర్ ఇప్పటికే తన కొడుకుకి యాక్టింగ్ డైరెక్షన్ లో కూడా శిక్షణ ఇప్పించినట్లు తెలుస్తోంది.
అయితే ఒకప్పుడు తన దర్శకత్వంలో వచ్చి హిట్ అందుకున్న సినిమాకి సీక్వెల్ తీసి తన కొడుకుని హీరోగా పరిచయం చేయాలని ప్లాన్ వేసాడట శంకర్.2004లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన కాదల్ చిత్రం సూపర్హిట్ అయింది.తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తో అర్జీత్ ను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారట క్రేజీ డైరెక్టర్ శంకర్.
ఈ సినిమాకు దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా శంకర్ వ్యవహరించాబోతున్నట్లు తెలుస్తోంది.కాగా ఇప్పటికే శంకర్ చిన్న కూతురు అతిథి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కార్తి సరసన ఓ చిత్రంలో అవకాశాన్ని కొట్టేసింది.