కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని భారీ బడ్జెట్ తో లైకా సంస్థ నిర్మిస్తుంది.
సుమారు రెండు వందల కోట్లకి పైగానే బడ్జెట్ పెడుతున్నారు.భారీ కాన్వాస్ పై శంకర్ ఆవిష్కరిస్తున్న ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఏవో ఒక అవాంతరాలు వస్తూనే ఉన్నాయి.
ఆరంభంలో సినిమా స్టార్ట్ చేయడానికి సమయం పట్టింది.తరువాత షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత షూటింగ్ స్పాట్లో క్రేన్ ప్రమాదం జరిగి ఇద్దరు యూనిట్ సభ్యులు చనిపోవడంతో కొన్ని రోజులు సినిమా షూటింగ్ వాయిదా పడింది.
అయితే ఈ ప్రమాదానికి నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణమని శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ చనిపోయిన కుటుంబాలకి భారీగా నష్ట పరిహారం కూడా చెల్లించింది.
ఈ ఘటన కారణంగా ఆగిపోయిన షూటింగ్ లో కమల్ హాసన్ ఎంటర్ కావడంతో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కొంత వరకు ఫైనాన్సియల్ గా దెబ్బతిన్న లైకా ప్రొడక్షన్ ఈ సినిమా బడ్జెట్ తగ్గించుకోవాలని దర్శకుడు శంకర్ కి చెబుతుంది.
అయితే బడ్జెట్ విషయంలో శంకర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.దీంతో నిర్మాతలు సినిమా షూటింగ్ ప్రారంభంపై సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తుంది.ఈ కారణంగా కొంత అసహనానికి గురైన శంకర్ నిర్మాతలకి లేఖ రాసినట్లు తెలుస్తుంది.సినిమా స్టార్ట్ చేసేది, లేనిదీ క్లారిటీ ఇస్తే తాను నెక్స్ట్ సినిమాకి వెళ్లిపోతానని అందులో పేర్కొన్నట్లు తెలుస్తుంది.
ఇక కమల్ హాసన్ కూడా రాజకీయాలలో బిజీ కావడంతో సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి శంకర్ సమాలోచన చేస్తున్నట్లు సమాచారం.