టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇండియాలోనే టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు.టాప్ దర్శకుల జాబితాలో ముందు వరుసలో ఉండేలా మనోడు నిలిచాడు.
అద్బుతమైన టేకింగ్, విభిన్నమైన సినిమాల ఎంపిక విషయంలో దర్శకుడు రాజమౌళి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.రాజమౌళి బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ను దక్కించుకున్నాడు.
అన్ని విధాలుగా కూడా రాజమౌళి ఒక స్టార్డంను దక్కించుకున్నాడు.అయితే రాజమౌళికి ముందు సౌత్ నుండి శంకర్ను ది గ్రేట్ డైరెక్టర్ అనే వారు.
కాని రాజమౌళి వచ్చిన తర్వాత శంకర్ తర్వాత స్థానంకు పడిపోయాడు.
తన స్థానంను పదిలపర్చుకునేందుకు దర్శకుడు శంకర్ విపరీతమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
బాహుబలి చిత్రంను ఢీ కొట్టే విధంగా దర్శకుడు శంకర్ 2.ఓ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ ఏడాది చివరి వరకు భారతీయుడు 2 చిత్రాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది.ఆ తర్వాత భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని దర్శకుడు శంకర్ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరోలు అయిన విజయ్ మరియు విక్రమ్లతో శంకర్ సినిమా ఉండబోతుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట.
విజయ్తో గతంలో త్రి ఇడియట్స్ రీమేక్ను తెరకెక్కించిన శంకర్, విక్రమ్తో అపరిచితుడు మరియు ఐ చిత్రాలను తెరకెక్కించాడు.ఆ చిత్రాలు అద్బుతంగా విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
అందుకే శంకర్తో మళ్లీ సినిమాను చేసేందుకు ఆ హీరోలు చాలా ఆసక్తిగా ఉన్నారు.అందుకే వారిద్దరితో మల్టీస్టారర్ చిత్రం చేయాలని ఆశ పడుతున్నారు.
ప్రస్తుతం రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్న నేపథ్యంలో శంకర్ కూడా అదే ప్రయత్నంను చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.మరి వీరిద్దరిలో ఎవరి మల్టీస్టారర్ ఎక్కువ వసూళ్లను నమోదు చేస్తుందో చూడాలి.