స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు సీక్వెల్ మేగ్జిమమ్ ఆగిపోయినట్లే అని తెలుస్తుంది.కమల్ హాసన్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీ అయిపోవడంతో ఎన్నికలు ముగిసే వరకు భారతీయుడు సీక్వెల్ పై ఎలాంటి అప్డేట్ ఉండే అవకాశం లేదు.
ఈ నేపధ్యంలో తన కొత్త సినిమా కోసం శంకర్ వర్క్ అవుట్స్ చేసుకుంటున్నారు.ఇక హీరో యష్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ ని తెరకెక్కించడానికి శంకర్ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తుంది.
మరో వైపు తన సూపర్ హిట్ సినిమాలకి సీక్వెల్ స్టోరీస్ రాసుకునే పనిలో ఉన్నాడనే వార్త కూడా వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఉన్నపళంగా శంకర్ కు చెన్నై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు వార్త ప్రచారంలోకి వచ్చింది.
ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి.దీనిపై దర్శకుడు శంకర్ స్పందించారు.
తనపై వారెంట్ జారీ అయిందంటూ మీడియాలో వచ్చిన వార్తలు తనను రోబో కథ విషయంపై ఓ రచయిత పెట్టిన కేసు కోర్టులో నడుస్తుంది.ఈ కేసుపైనే చెన్నైలోని ఎగ్మూర్ మెట్రోపాలిట్ మేజిస్ట్రేట్ కోర్టును శంకర్ కి నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసిందని ప్రచారం జరిగింది.
దీనిపై దర్శకుడు శంకర్ క్లారిటీ ఇచ్చారు.తనకి ఎలాంటి వారెంట్ జారీ చేయలేదని శంకర్ వివరించారు.కోర్టు ఆన్ లైన్ వ్యవహారాల్లో తప్పిదం కారణంగా వారెంట్ అంటూ ప్రచారం జరిగి ఉండొచ్చని, ఇప్పుడా పొరబాటును దిద్దుతున్నారని శంకర్ తెలిపారు.నిర్ధారణ లేకుండానే తప్పుడు వార్తలు ప్రసారం కావడం తనను విస్మయానికి గురిచేసిందని తెలిపారు.
ఈ పరిస్థితి కారణంగా తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అనవసరంగా వేదనకు గురయ్యారని వెల్లడించారు.ఇలాంటి వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.