కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.ఈ విషయం ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యింది.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన శంకర్ దానికి కొంత విరామం ఇచ్చి కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు.గ్రాండ్ గా పెళ్లి చేయాలని అనుకున్న ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్ష్యంలోనే తక్కువ మందితో చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.
అయితే ఇప్పుడు శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది.తాజాగా ఈ విషయం బయటకొచ్చింది.
వర్ధమాన క్రికెటర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేసి రాణిస్తున్న రోహిత్ దామోదరన్ తో ఐశ్వర్య పెళ్లి జరగబోతుంది.పాండిచ్చేరి జట్టు తరుపున రోహిత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు.
ఇదిలా ఉంటే వీరి పెళ్లి వేడుక మహాబలిపురంలో జరగబోతుంది.అతి కొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
కూతురు పెళ్లి తర్వాత శంకర్ రామ్ చరణ్ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఆగష్టులో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతున్నారు.సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తూ ఉండగా కియరా అద్వానీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.దీంతో పాటు హిందీలో అపరిచితుడు మూవీని రణవీర్ సింగ్ తో రీమేక్ చేయడానికి కూడా శంకర్ రెడీ అయిన సంగతి తెలిసిందే.