సౌత్ ఇండియాలో భారీ చిత్రాల దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి శంకర్.శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ సినిమాపై ఉన్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మొదటి నుంచి ఏవో అవాంతరాలు వస్తున్నాయి.
షూటింగ్ జరుగుతూ ఉండగా క్రేన్ విరిగిపోవడంతో ఇద్దరు కార్మికులు చనిపోయారు.ఆ తరువాత షూటింగ్ ఆగిపోయింది.
అదే సమయంలో కరోనా లాక్ డౌన్ కూడా రావడంతో పూర్తిగా వాయిదా పడింది.మరల లాక్ డౌన్ సడలింపులు తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలని శంకర్ చూస్తున్న నిర్మాతలు బడ్జెట్ కారణాలు చూపిస్తూ ఆలస్యం చేస్తున్నారు.ఈ నేపధ్యంలో భారతీయుడు సీక్వెల్ ని శంకర్ పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తున్నాడు.ఈ నేపధ్యంలో ప్రస్తుతం కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఆయన పెద్దమ్మాయి అదితి శంకర్ కు త్వరలో వివాహం జరగనుంది.ఈ పెళ్లి వేడుకని గ్రాండ్ గా చేయాలని అనుకుంటున్న శంకర్ ప్రొఫెషనల్ వ్యాపకాలు పక్కన పెట్టి ఈ పెళ్లి వేడుకపైనే శ్రద్ధ పెట్టాడు.పెళ్లి తర్వాత భారతీయుడు 2 నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోతే పాన్ ఇండియా స్థాయిలో సౌత్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే పనిలో ఉన్నారు.దీనికోసం ఇప్పటికే కేజీఎఫ్ స్టార్ యష్, విజయ్ సేతుపతితో మాట్లాడి వారి నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు.
అలాగే తెలుగు నుంచి కూడా ఓ క్రేజీ హీరోని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ ముగ్గురు హీరోల మల్టీ స్టారర్ ని భారీ బడ్జెట్ తోనే శంకర్ ప్లాన్ చేస్తున్నారు.