ఇండియన్ 2 సినిమా ను మద్యలో వదిలేసిన దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ లైకా వారి నుండి లీగల్ చర్యలను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.అనుకున్న సమయానికి సినిమా ను పూర్తి చేయాలేక పోయిన కారణంగా శంకర్ పై చర్యలకు సిద్దం అయిన లైకా వారికి మరింత కోపం కలిగేలా ఆయన మరో సినిమా ను మొదలు పెట్టాడు.
మరో వైపు బాలీవుడ్ లో అపరిచితుడు సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లుగా కూడా ప్రకటించాడు.ఇండియన్ 2 సినిమా పూర్తి అవ్వకుండా శంకర్ మరే సినిమాను చేయను అంటూ మాతో అగ్రిమెంట్ లో ఉన్నాడు.
కనుక ఆ సినిమా పూర్తి అయ్యే వరకు ఎవరు కూడా ఆయన దర్శకత్వం లో సినిమా ను నిర్మించవద్దంటూ ఇప్పటికే లైకా వారు హిందీ మరియు తెలుగు నిర్మాతల మండలికి లేఖలు రాయడం జరిగింది.ఆ లేఖలను స్వీకరించిన నిర్మాతల మండలి ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
ఒక వైపు
లైకా
వారు చాలా సీరియస్ గా లీగల్ చర్యలకు సిద్దం అవుతున్న సమయంలో మరో వైపు శంకర్ మాత్రం తనకు ఏమీ పట్టనట్లుగా రామ్ చరణ్ సినిమా ను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు.ఇప్పటికే స్టోరీ లైన్ ను ఓకే చేసిన మేకర్స్ తాజాగా స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేశారని తెలుస్తోంది.
శంకర్ తన టీమ్ తో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దిల్ రాజు అమెరికా నుండి వచ్చిన వెంటనే చెన్నైకు వెళ్లి అక్కడ శంకర్ తో భేటీ అయ్యి స్క్రిప్ట్ ను ఫైనల్ చేయబోతున్నాడు.
ఆ వెంటనే చరణ్ మరియు చిరంజీవిలకు ఆ స్క్రిప్ట్ ను వినిపించనున్నారు.స్క్రిప్ట్ వ్యవహారంను పూర్తి చేసి జులై ఆగస్టు వరకు సినిమా ను పట్టాలెక్కించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వర్క్ చాలా స్పీడ్ గా జరుగుతుంది.ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే దిల్ రాజుకు లైకా వారి నుండి ఏమైనా సమస్య వచ్చేనా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.