తెలుగులో ప్రస్తుతం అక్కినేని హీరో నాగ చైతన్య “లవ్ స్టోరీ” అనే చిత్రంలో హీరోగా నటించిన సంగతి అందరికి తెలిసిందే.కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫిదా మూవీ ఫేమ్ “సాయి పల్లవి” నటించగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “శేఖర్ కమ్ముల” దర్శకత్వం వహించాడు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.కాగా ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ “పవన్ సి.హెచ్” సంగీత స్వరాలు సమకూర్చారు.అయితే తాజాగా ఈ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ ప్రముఖ పత్రిక నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా ఈ చిత్రం షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు చాలా కష్ట పడ్డారని అందుకు తగ్గ ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.అలాగే ఈ చిత్రంలో హీరోగా నటించిన నాగ చైతన్య పాత్ర కోసం చాలా కష్టపడ్డామని అంతేకాకుండా నాగ చైతన్య పాత్ర ఆహార్యం మరియు డైలాగులు, బాడీ లాంగ్వేజ్ వంటి వాటిపై ఎక్కువ దృష్టి సారించినట్లు తెలిపాడు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి కూడా తన తన పాత్రకి 100% న్యాయం చేసిందని దాంతో బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగిందని చెప్పుకొచ్చాడు.ఇక ఈ చిత్రం స్టోరీ విషయానికి వస్తే ఈ చిత్రంలో భావోద్వేగాలు, సెంటిమెంటల్ సన్నివేశాలు, మోటివేషనల్ సన్నివేశాలు వంటి వాటితో చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అలాగే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ సమయంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నామని అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి సినిమా థియేటర్లలో విడుదల చేయబోతున్నామని తెలిపాడు.కాగా ఈ చిత్రం ఈనెల 24వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.మరి దర్శకుడు శేఖర్ కమ్ముల అంచనాలను అందుకొని “లవ్ స్టోరీ” ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.