రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకొని తరువాత దొంగలబండి సినిమాతో దర్శకుడుగా మారి మొదటి సినిమాతో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న వ్యక్తి సతీష్ వేగేశ్న.అయితే ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి దిల్ రాజు ప్రొడక్షన్ లో శతమానం భవతి అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.
ఈ సినిమా శర్వానంద్ కి కూడా మంచి ఇమేజ్ తీసుకొచ్చింది.ఈ సినిమా తర్వాత మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లోనే శ్రీనివాస కళ్యాణం అనే సినిమాని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీశారు.
ఈ సినిమాలో పెళ్లి గురించి గొప్పగా చెప్పాలని ప్రయత్నం చేసిన మరీ మేలో డ్రామాగా అనిపించడంతో ప్రేక్షకులు తిరస్కరించారు.
రీసెంట్ గా కళ్యాణ్ రామ్ తో ఎంత మంచివాడవురా అనే సినిమా తీసిన అది కూడా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.
అయితే సక్సెస్ ఫుల్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన కూడా సతీష్ వేగేశ్నకి ఇండస్ట్రీలో పెద్దల సపోర్ట్ భాగానే ఉంది.ఈ నేపధ్యంలో తన కొడుకుని ఈ దర్శకుడు హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నాడు.
అతని కోసం ఓ మంచి కథని కూడా సిద్ధం చేసాడని తెలుస్తుంది.దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి కొడుకుని లాంచ్ చేస్తే మంచి లైఫ్ ఉంటుందని భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
మరి కొడుకు కోరికని తీర్చడానికి తండ్రిగా సతీష్ వేగేశ్న చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.