సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ఈ మధ్య కాలంలో ఈటీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.తెలుగులో ఇంద్రజ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.
దర్శకుడు సాగర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.దర్శకుడు సాగర్ తాను డైరెక్టర్ గా సక్సెస్ అయ్యానని అయితే ప్రొడ్యూసర్ గా ఫెయిల్ అయ్యానని తెలిపారు.
తాను ఒక సినిమా తీసిన విధంగా మరో సినిమాను తెరకెక్కించనని సాగర్ పేర్కొన్నారు.నేను ఇష్టపడిన వాటిలో ఫెయిల్ అయిన రెండు మూడు సినిమాలు ఉన్నాయని సాగర్ వెల్లడించారు.
సీతక్క సినిమా తీశానని హిట్ అయిందని అమ్మా అమ్మను చూడాలని ఉంది సినిమాను తీశానని ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదని సాగర్ తెలిపారు.ఆ సినిమాలో సౌందర్యను పెట్టి ఉంటే సక్సెస్ సాధించేదని సాగర్ చెప్పుకొచ్చారు.
మోహన్ బాబుకు తాను శిష్యుడినని సాగర్ తెలిపారు.ఇంద్రజను అమ్మదొంగ సినిమాకు ఎంపిక చేస్తే చాలామంది అబ్జెక్ట్ చేశారని సాగర్ వెల్లడించారు.
ఆ సినిమా ద్వారా ఆమనికి మంచి పేరు వచ్చిందని సాగర్ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత జగదేకవీరుడు సినిమాకు ఇంద్రజను ఎంపిక చేశామని ఆ సినిమాలో మరో కీలక పాత్రలో కేఆర్ విజయ నటించగా ఆమె రైలులో రావడానికి అంగీకరించారని సాగర్ తెలిపారు.
తనకు డబ్బులు మిగులుతున్నా ఫీల్ అయ్యానని సాగర్ వెల్లడించారు.ఇంద్రజకు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేశామని అయితే ఇంద్రజ తాను రైలులో ప్రయాణిస్తే వాంతి చేసుకుంటానని చెప్పడంతో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చిందని సాగర్ వెల్లడించారు.దర్శకుడు సాగర్ ఇంద్రజ గురించి ఎవరికీ తెలియని విషయాలను వెల్లడించడం గమనార్హం.సాగర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.