ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ తన చిత్రాల మార్కెటింగ్ విషయంలో కొత్త కొత్త దారులను వెతుక్కుంటూ సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఈ చిత్రాన్ని ఈనెల 24వ తారీఖున ఆన్ లైన్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు.కాగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్ర ట్రైలర్ ని చూసేందుకు కూడా దాదాపుగా 40 నుంచి 50 రూపాయలు టిక్కెట్ ధరలను నిర్ణయించి వసూలు చేయాలని యోచిస్తన్నాడట.దీంతో ఈ వార్తని ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో నెటిజన్లు బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.
అంతేగాక మరికొందరు మాత్రం మామూలుగా ఆర్జీవీ సినిమాలను డబ్బులు పెట్టి సినిమా థియేటర్లలో చూడడమే దండగ అనుకుంటే ట్రైలర్ కి కూడా డబ్బులు చెల్లించాలంటే ఈ చిత్ర ట్రైలర్ ని రామ్ గోపాల్ వర్మ తప్ప మరెవరూ డబ్బులు పెట్టి చూడరని కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడటంతో సినీ దర్శకులంతా ఖాళీగా గడుపుతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఆన్ లైన్ ద్వారా తన చిత్రాలను విడుదల చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తున్నాడు.
దీనికితోడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించే నటీనటులంతా కొత్తవారు కావడంతో పారితోషికం విషయంలో కూడా పెద్దగా ఖర్చు కానట్లు తెలుస్తోంది.అయితే ఇటీవలే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “నగ్నం” అనే చిత్రం అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించి దాదాపుగా 90 లక్షల రూపాయలకి పైగా వసూలు చేశాడు.
.