తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ అలాగే సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి సినిమాలు తీస్తూ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న తెలుగు డేర్ అండ్ డాషింగ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు సెటైరికల్ ట్వీట్స్ మరియు తన సినిమాలకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు.
కాగా తాజాగా సోషల్ మీడియాలో తన గురించి ప్రచారం అవుతున్నటువంటి ఓ ఫేక్ న్యూస్ గురించి రామ్ గోపాల్ వర్మ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించాడు.
అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకున్నటువంటి ఓ విషయం పై రామ్ గోపాల్ వర్మ తొందర్లోనే సినిమా తీయబోతున్నాడని కొందరు ఆర్జీవి ఫోటో నకిలీ ట్విట్టర్ ఖాతాను సృష్టించి “నాకెందుకో ఈటెల రాజేందర్ కెసిఆర్ కి వెన్నుపోటు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు సేమ్ అనిపించింది.
అందుకే ఈటెల రాజేందర్ కేసిఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన విధానం గురించి తెలంగాణ రాజకీయ మేధావులతో చర్చించి సినిమా తీద్దామని నిర్ణయించుకున్నానని అలాగే ఈ సినిమా పేరు వెన్నుపోటు ఈటెలు అంటూ ఏకంగా సినిమా పేరును కూడా చెబుతూ ట్వీట్ చేశారు.దీంతో ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఈ విషయం గురించి స్పందిస్తూ ఈ ట్వీట్ కి మరియు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు.
దీంతో సినీ ఇండస్ట్రీలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల జోక్యం గురించి సినిమాలు తీయడం వల్ల కొంతమేర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరికొందరైతే రామ్ గోపాల్ వర్మ ఈటెల రాజేందర్ మరియు కేసీఆర్ గురించి సినిమా తీయట్లేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆర్జీవి మామూలోడు కాదని ఇలాంటి గారడీ మాటలు చెప్పి పబ్లిసిటీ చేసుకోవడం రాత్రికి రాత్రే సినిమా తీసి విడుదల చేయడం కొత్తేమీ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “కొండా” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పుతున్న ప్రముఖ మహిళ రాజకీయవేత్త కొండా సురేఖ మరియు ఆమె భర్త నిజజీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.