టాలీవుడ్ ఇండస్ట్రీలో జక్కన్నగా దర్శకధీరుడు రాజమౌళికి పేరుంది.తను అనుకున్నది అనుకున్న విధంగా వచ్చే వరకు రాజమౌళి రాజీ పడరు.
అన్నీ అనుకున్న విధంగా జరిగి ఉంటే 2021 జనవరిలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయ్యేది.అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆర్ఆర్ఆర్ షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి.
దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెకుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో రాజమౌళి తాజాగా ఆర్ఆర్ఆర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు సెట్ మీదకు వస్తున్న నేపథ్యంలో అక్కడక్కడా షూటింగ్ లు ప్రారంభం అవుతున్నాయి.అయితే ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకు లోబడి ఆర్ఆర్ఆర్ షూటింగ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి నిబంధనలు పూర్తిస్థాయిలో సడలించిన తర్వాత ఒకే షెడ్యూల్ లో ఆర్ఆర్ఆర్ ను పూర్తి చేసే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
లొకేషన్లు, షెడ్యూల్ వ్యవహారం, విడుదల ఇలాంటి కీలక విషయాలకు సంబంధించి రాజమౌళి ఇప్పటికే తన టీమ్ తో చర్చలు జరుపుతున్నాడని సమాచారం.2021 దసరా లేదా 2022 సంక్రాంతి పండగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.రాజమౌళి ఒక్కసారి మొదలైతే అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఎన్టీఆర్, చరణ్ లను టార్చర్ చేయడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా మెజారిటీ శాతం షూటింగ్ పూర్తైంది.
తెలుస్తున్న సమాచారం మేరకు 30 శాతం షూటింగ్ బ్యాలన్స్ ఉందని తెలుస్తోంది.విశ్రాంతి లేకుండా వీలైనంత త్వరగా చరణ్, ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన షూట్ పూర్తయ్యేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
గ్రాఫిక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కొసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండటంతో రాజమౌళి ఒకే షెడ్యూల్ లో షూటింగ్ పూర్తయ్యేలా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.