స్టార్ హీరో రామ్ చరణ్, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు రాజమౌళి ఝలక్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.టాలీవుడ్ లో వరుస విజయాలతో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లు దాదాపు రెండేళ్లుగా పూర్తిస్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమాకే పరిమితమయ్యారు.
ఆర్ఆర్ఆర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కాల్సి ఉంది.
మరోవైపు రామ్ చరణ్ తదుపరి సినిమా ఎవరి దర్శకత్వంలో తెరకెక్కబోతుందో స్పష్టత రాకపోయినా ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటించాల్సి ఉంది.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయ్యే వరకు ఈ ఇద్దరు హీరోల లుక్స్ లో మార్పు రాకూడదనే ఉద్దేశంతో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవద్దని ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత మాత్రమే ఇతర సినిమాల్లో నటించాలని షరతులు పెట్టారని సమాచారం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తైంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో హీరోయిన్ల కాంబినేషన్ సీన్లు తెరకెక్కించాల్సి ఉంది.మరోవైపు లాక్ డౌన్ వల్ల ఖాళీ సమయం ఎక్కువగానే దొరికినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయించుకోలేకపోమని స్వయంగా రాజమౌళి వెల్లడించారు.
దీంతో షూటింగ్ పూర్తైనా ఈ సినిమా విడుదల కోసం చాలా నెలల ఎదురుచూపులు తప్పవు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినమాను మొదట 2020 జులై 31వ తేదీన విడుదల చేస్తానని ప్రకటించి ఆ తర్వాత జనవరి 8 2021లో విడుదల చేస్తామని చెప్పారు.
అయితే కరోనా, లాక్ డౌన్ జక్కన్న ప్లాన్లను తలక్రిందులు చేయడంతో రాజమౌళి సైతం సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.మరోవైపు రాజమౌళి షరతులు స్టార్ హీరోల అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి.
వచ్చే ఏడాది సమ్మర్ లేదా దసరా పండుగ కానుకగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.