టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో కథలు రాసి వేగంగా సినిమాలు తీసే దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కు పేరుంది.పూరీ టేకింగ్ ను, డైలాగులను ఆయన అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారు.
టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు తీసిన పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.లాక్ డౌన్ వల్ల కొంత ఖాళీ సమయం దొరకడంతో పూరీ మ్యూజింగ్స్ ద్వారా వీడియోలు చేస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.
తాజాగా పూరీ జగన్నాథ్ ఫారెస్ట్ అనే అంశం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనను తాను జంతువులా ఊహించుకుంటానని.ఎటువంటి సమస్యలు ఎదురైనా అడవిలో ఉన్న భావనతో జీవిస్తానని చెప్పారు.తాను జంతువును కాబట్టి ఇతర జంతువులు దాడి చేసి చంపేస్తాయనే భయం ఉంటుందని.
తనపై దాడి చేసిన జంతువు చేతిలో ఉన్న వస్తువులను పట్టుకొని పోవొచ్చని అన్నారు.
అయితే అలా తనను చంపాలని చూసినా తనపై దాడి చేసినా ఆ జంతువుపై పగ పెంచుకోనని.
అలాంటి ఘటనలు జరిగే అప్పటినుంచి జాగ్రత్తగా ఉండాలని మాత్రమే తాను భావిస్తానని అన్నారు.జంతువులపై అసూయ, కోపం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని అన్నారు.మనుషుల వల్ల కూడా జంతువులకు ఎంతో హాని జరుగుతుందని.మనుషులు జీవించినంత కాలం ఎన్నో జంతువుల ప్రాణాలు పోతుంటాయని తెలిపారు.
పూరీ పరోక్షంగా మనుషులపై సెటైర్లు వేశారు.మనుషుల్లా జంతువులు కోపం, పగ, అసూయను క్యారీ చేయవని.మనుషులు కూడా అలాంటి భావాలు వీడాలని చెప్పారు.మరోవైపు పూరీజగన్నాథ్ ఫైటర్ సినిమా తరువాత మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు.
గతంలో తయారు చేసిన జనగణమన స్క్రిప్ట్ తో పూరీ మహేష్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.అయితే మహేష్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాల్సి ఉంది.