2008 సంవత్సరంలో యువత సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన పరశురామ్( Parasuram ) ఆ తర్వాత ఆంజనేయులు సినిమాని రూపొందించాడు.ఆ తర్వాత సోలో ( Solo )మరియు సారొచ్చారు సినిమాలను రూపొందించాడు.
నాలుగు సినిమాలకు నాలుగు కూడా నిరాశ పర్చాయి.అయినా కూడా దర్శకుడిగా అవకాశాలను దక్కించుకున్నాడు.
శ్రీరస్తు శుభమస్తు( Srirastu Subhamastu ) సినిమాని రూపొందించిన పరశురామ్ ఆ చిత్రంతో కూడా నిరాశ పర్చాడు.
కెరీర్ ఆరంభం అయిన దాదాపు పది సంవత్సరాల తర్వాత పరశురామ్ ‘గీతా గోవిందం’( Geetha Govindam ) సినిమాతో సక్సెస్ ని దక్కించుకున్న విషయం తెల్సిందే.అదృష్టం కొద్ది అనూహ్యంగా పరశురామ్ కి సర్కారు వారి పాట సినిమా తో మరో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.సర్కారు వారి పాట( Sarkaru Vaari Paata ) సినిమా కు ముందు నాగ చైతన్య( Naga Chaitanya ) హీరోగా పరశురామ్ ఒక సినిమాను చేయాల్సి ఉంది.
కానీ ఆ సినిమా ను క్యాన్సల్ చేసుకుని సర్కారు వారి పాట సినిమా ను చేయడం జరిగింది.మహేష్ బాబు( Mahesh Babu) సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
సరే సర్కారు వారి పాట సినిమా తర్వాత అయినా పరశురామ్ దర్శకత్వం లో నాగ చైతన్య సినిమా వస్తుందని అంతా భావించారు.నాగ చైతన్య సమయం అంతా వృదా చేసి చెప్పా పెట్టకుండా విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) హీరోగా ఒక సినిమా ను చేసేందుకు సిద్ధం అయ్యాడు.దిల్ రాజు ( Dil Raju )నిర్మాణం లో సినిమా ప్రకటన రావడంతో అల్లు అరవింద్( Allu Aravind ) కోపంతో ఊగిపోయాడు.అల్లు అరవింద్ సినిమా కు హ్యాండ్ ఇచ్చిన పరశురామ్ ఇప్పుడు దిల్ రాజుకు కూడా హ్యాండ్ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
తమిళంలో సినిమాను చేసేందుకు పరశురామ్ ప్లాన్ చేస్తున్నాడట.ఇలా చేయడం ఏమాత్రం సరిగా లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.పరశురామ్ ఇలా అయితే కెరీర్ లో ముందుకు సాగడం కస్టమే కదా.!
.