ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ లను అందిస్తుంటారు సిని బృందాలు.ఇక సినిమాలకు సంబంధించిన వార్త ఏదైనా సరే సామాన్యంగా ఆ సినిమా దర్శక నిర్మాతల నుండి మాత్రమే అప్ డేట్ లు వినిపిస్తాయి.
అంతేకానీ మధ్యవర్తుల నుండి సినిమాల గురించి ఎటువంటి విషయాలు రావు.ఒకవేళ అలా వచ్చినట్లయితే పుకార్లనే అర్థమవుతుంది.
ఇలా ఇప్పటికి ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో పుకార్లు ఎదురవ్వగా ఎప్పటికప్పుడు పుకార్ల పై స్పందిస్తుంటారు సిని బృందాలు.ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి సినిమా పై కూడా ఓ రూమర్ వినిపించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ బిజీలో ఉండగా.మోహన్ లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన సినిమా లూసిఫర్.ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా మోహన్ లాల్ కెరీర్లో మలుపుతిప్పిన సినిమా అని తెలిసింది.ఇక ఇంత మంచి సక్సెస్ అందుకున్న సినిమా అవడంతో చిరంజీవి కూడా చేయాలని ప్రస్తుతం ఈ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు.
తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలోని ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరింతగా ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి.అయితే ఈ సినీ దర్శకుడు మార్పులు చేసినందుకు చిరంజీవికి నచ్చలేదని, పైగా ఈ సినిమా నుండి డైరెక్టర్ మోహన్ రాజా తప్పుకున్నాడని వార్తలు వైరల్ గా మారాయి.
ఇక దీంతో ఈ పుకారు వైరల్ గా మారడంతో సినీ బృందం స్పందించారు.
ఇదంతా పుకారేనని.
ఈ సినిమాకు డైరెక్టర్ మోహన్ రాజా చేసిన మార్పుల వల్ల చిరంజీవి పూర్తిగా మద్దతు ఇచ్చాడని, పైగా చిరంజీవి కూడా ఈ మార్పు పట్ల సంతృప్తి చెందాడని తెలిసింది.ఇక ఇదంతా పుకారని తేలగా.
ప్రస్తుతం పరిస్థితులు తీవ్రంగా ఉన్నందున దీని తర్వాత ఈ సినిమాను పట్టా లెక్కించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో నటించే ముఖ్యపాత్రధారులు గురించి కూడా డైరెక్టర్ ముందుగానే చిరంజీవి కి వినిపించాడట.