యంగ్ హీరో నాగ శౌర్య ఈ మధ్య పెద్దగా సక్సెస్ లు అందుకోకపోయిన వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.సుకుమార్ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయబోతూ ఉండగా, సొంత ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా సెట్ చేసుకున్నాడు.
ఇప్పుడు వైజయంతి అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమా బ్యానర్ లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అది కూడా తనకి కళ్యాణ వైభోగమే లాంటి సూపర్ హిట్ ఇచ్చిన నందిని రెడ్డి దర్శకత్వంలో చేయడానికి ఒకే చెప్పాడు.
అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి మంచి ఫీల్ గుడ్, కామెడీ ఎంటర్టైన్మెంట్ కథలతో సినిమాలు చేయడంలో దిట్ట అనిపించుకుంది.ఆమె చివరిగా సమంతతో ఓ బేబీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.అయితే ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నందిని రెడ్డి ఈ సారి తన సొంత కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
తనకి భాగా అలవాటైన లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకుంది.మిక్కీ.
జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి, లక్ష్మి భూపాల్ సంభాషణలను అందిస్తున్నాడు.త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.