మంచు మనోజ్ భూమా మౌనిక త్వరలో పెళ్లి చేసుకుంటారని ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వినిపించినా ఆ వార్తలు నిజం కాలేదనే సంగతి తెలిసిందే.ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన జి.
నాగేశ్వరరెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను నమ్మేది ప్రజంటేషన్ ఆఫ్ మూడ్ అని ఆయన చెప్పుకొచ్చారు.కొత్త కథలు అంటే అందులో మీనింగ్ లేదని ఆయన కామెంట్లు చేశారు.
ఈ జనరేషన్ కు విజువల్ వండర్ అని ఆయన చెప్పుకొచ్చారు.కొత్త కథ కాదని కొత్త ప్రజంటేషన్ అవసరం అని ఆయన అన్నారు.ప్రభాస్ అంటేనే ఓ కటౌట్ అని ఆయనను యానిమేషన్ హీరోలా చూపించడం కరెక్ట్ కాదని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.ఆదిపురుష్ గ్రాఫిక్స్ ఛేంజ్ చేయాలని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రభాస్ ను ప్రేమించే వాళ్లకు ఆదిపురుష్ టీజర్ నచ్చలేదని ఆయన పేర్కొన్నారు.
రాజమౌళి అంటే నాకు ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం కామెడీ సినిమాలు తగ్గిపోయానని అనిల్ రావిపూడి కామెడీ సినిమాలు బాగా తీస్తున్నారని ఆయన పేర్కొన్నారు.విష్ణుతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నానని ఆయన తెలిపారు.
మనోజ్ అహం బ్రహ్మాస్మి ప్రాజెక్ట్ లేట్ కావడం వల్ల మిగతా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టడం లేదని ఆయన వెల్లడించారు.
కొత్త కథలతో మనోజ్ ఎంట్రీ ఇస్తారని ఆయన పేర్కొన్నారు.మనోజ్ రాజకీయాల్లోకి వెళ్లొచ్చని వెళితే తప్పేంటని ఆయన వెల్లడించారు.మంచు లక్ష్మి ప్రపంచం వేరు అని నాగేశ్వరరెడ్డి అన్నారు.
మంచు కుటుంబం చాలా తెలివైన వాళ్లు అని ఆయన పేర్కొన్నారు.మనోజ్ సినిమాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
సినిమాసినిమాకు మనోజ్ మార్కెట్ పెరుగుతుండగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.