దర్శకుడు నాగ శేఖర్ తాజాగా గుర్తుందా శీతాకాలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాట్లాడుతూ హీరోయిన్ రష్మిక మందన వివాదం పై స్పందించారు.
ఈ సందర్భంగా నాగ శేఖర్ మాట్లాడుతూ.ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం నిజంగా మనదే తప్పు.
సంజు వెడ్స్ గీత సినిమాను నేను తెరకెక్కించినప్పుడు అందులో కొంతమంది నటీనటులకు అవకాశం ఇచ్చాను.ఆ సినిమాలో నటించిన నటీనటులు ప్రస్తుతం వారి కెరియర్లో పెద్ద స్టార్స్ అయ్యారు.
అయితే ఆ సినిమా తర్వాత వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకుంటారా లేదా అన్నది అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం.ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోను.నా తదుపరి సినిమాపై ఫోకస్ పెడతాను.మనం ఎదుటి వాళ్ళ నుంచి కృతజ్ఞతా భావాన్ని కోరుకున్నప్పుడే మనం ఎక్కడో ఒకచోట బాధకు లోనవుతాం అని చెప్పుకొచ్చారు నాగ శేఖర్.
అనంతరం హీరోయిన్ రష్మిక మందన వివాదం పై స్పందిస్తూ.రష్మికని కన్నడ సినీ పరిశ్రమ బ్యాన్ చేయనుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆ విషయం గురించి పూర్తిగా నాకు తెలియదు.
ఒకవేళ అలా చేస్తే అది ఆ పరిశ్రమకే నష్టం.
ఈ విషయం నేను సపోర్ట్ చేయను అని చెప్పుకొచ్చారు నాగ శేఖర్.
కాగా ఇంటర్వ్యూలో భాగంగా నాగ శేఖర్ చేసిన వాక్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హీరోయిన్ రష్మిక మందన విషయానికొస్తే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ లలో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కిరాక్ పార్టీ సినిమాతో తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకపోవడం పట్ల నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు నటిగా నువ్వు ఈ స్థాయిలో ఉన్నావ్ అంటే దానికి కారణం పరంవా నిర్మాణ సంస్థ.రక్షిత శెట్టి కి చెందిన ఆ సంస్థ లేకపోతే నువ్వు నటివి అయ్యే దానివి కాదు అంటూ పలువురు రష్మిక మందన పై మంది పడ్డారు.