స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ లలో పాల్గొనడంతో పాటు రాధేశ్యామ్ సినిమా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉండగా ఆ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు.ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి రెండు అప్ డేట్స్ ను ఇస్తానని చెప్పిన నాగ్ అశ్విన్ గత నెలలోనే ప్రకటించి ఇప్పటికే ఒక అప్ డేట్ ఇచ్చారు.
ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించబోతున్నట్టు గత నెల 29వ తేదీన ప్రకటన వెలువడింది.
ఈ నెల 26వ తేదీన మరో ప్రకటన వెలువడుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావించారు.అయితే నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు ఝలక్ ఇస్తూ ఫిబ్రవరి 26వ తేదీన ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదని తెలిపారు.
ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా నుంచి ముఖ్యమైన అప్ డేట్ వస్తుందని భావించిన ఫ్యాన్స్ కు నాగ్ అశ్విన్ నిరాశనే మిగిల్చారు.
అయితే నాగ్ అశ్విన్ అప్ డేట్ విషయంలో వెనక్కు తగ్గడానికి కారణం తెలియాల్సి ఉంది.అప్ డేట్ గురించి చెప్పడానికి ఇది సరైన సమయం కాదంటూ నాగ్ అశ్విన్ క్షమాపణలు కోరారు.అమితాబ్ బచ్చన్దీపికా పదుకొనే ఈ సినిమాలో నటించనున్నారు.
దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.మహానటి సక్సెస్ తో మంచి పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు ప్రచారం జరుగుతుండగా అధికారకంగా తెలియాల్సి ఉంది.ఈ ఏడాది చివరి నుంచి ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.