యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
దీనిని కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమా సైన్సు ఫిక్షన్ కథాంశంతో ఉంటుందని చాలా కాలంగా టాక్ వినిపిస్తుంది.
అయితే సోషియో ఫాంటసీ కథగా ఉంటుందని ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది.అయితే ఈ కథ ఎలా ఉండబోతుంది అనే విషయంలో దర్శకుడు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
బడ్జెట్ బట్టి చూస్తే మాత్రం కచ్చితంగా ఫిక్షన్ కథాంశం అయ్యి ఉంటుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన అప్డేట్స్ తెలుసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు.
ఇక తాజాగా ఫ్యాన్స్ దర్శకుడు నాగ్ అశ్విన్ ని సినిమా గురించి విశేషాలు అడిగే ప్రయత్నం చేశారు.దీంతో ట్విట్టర్ లో ఈ సినిమాకి సంబందించిన అప్డేట్స్ పై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిపాడు.అలాగే సినిమా కథ ఇంకా పూర్తి స్థాయిలో రెడీ కాకపోవడం వలన కాస్టింగ్ గురించి ఆలోచించడం లేదని, ఇంకా ఎవరిని ఇందులో కాస్టింగ్ కోసం సంప్రదించడం, ఫైనల్ చేయడం జరగలేదని స్పష్టం చేశాడు.
దీనికి సంబందించిన కాస్టింగ్ సెలక్షన్ ఏమైనా ఉంటే అది స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాతే అని తెలియజేశాడు.దీంతో ఇన్ని రోజులు ఈ సినిమా బాలీవుడ్ హీరోయిన్స్ అంటూ వినిపిస్తున్న వార్తలకి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.