ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా దర్శకత్వం వహించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్, సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ ఆయన నయనతార ఇందులో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.ఈ సినిమా రేపు అనగా అక్టోబర్ 5న దసరా పండుగ థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
లూసీఫర్ సినిమాలో లేని ఒక కోణం ఈ గాడ్ ఫాదర్ సినిమాలో ఉంటుంది.
కథని అలాగే ఉంచి ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాను.ఇందులో హీరో చిరంజీవి పాత్రతో పాటుగా మరొక పది పాత్రలు కూడా గెలుస్తాయి.
మలయాళ సినిమాలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయి.అలాగే ఈ పది పాత్రలు కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటాయి అని చెప్పుకొచ్చారు మోహన్ రాజా.
ఆ పాత్రల్లో నటిస్తున్న నటీనటుల పేర్లు కూడా తెలిపారు.చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, మురళీ శర్మ, సునీల్, సముద్రఖని, షఫీ, బ్రహ్మాజీ.
ఈ పాత్రలన్నీ కూడా బాగా అట్రాక్ట్ చేస్తాయి అని చెప్పుకొచ్చారు మోహన్ రాజా.
అదేవిధంగా లూసిఫర్ సినిమా మోహన్ లాల్ పాత్ర నిడివి తో పోల్చితే చిరంజీవి పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలిపారు.2:50 నిమిషాల లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ గారు 50 నిమిషాలు మాత్రమే కనిపిస్తే, గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారు రెండు గంటల పాటు కనిపించబోతున్నారు అని చెప్పుకొచ్చారు మోహన్ రాజా.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా మోహన్ రాజా స్పీచ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి.ఈ సినిమా థియేటర్లో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ఎంతగానో ఎదురు చూస్తున్నారు అభిమానులు.