మెగా స్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత చేయబోతున్న సినిమా విషయంలో చాలా నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.లూసీఫర్ సినిమా షూటింగ్ కోసం రెడీ అయ్యిందని ఆ మద్య వార్తలు వచ్చాయి.
కాని కరోనా కారణంగా ప్రాజెక్ట్ లు అన్ని కూడా తారు మారు అవుతున్నాయి.ఇదే సమయంలో లూసీఫర్ రీమేక్ కూడా క్యాన్సిల్ అయ్యింది అంటూ టాక్ వినిపిస్తుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లూసీఫర్ రీమేక్ ను కాస్త ఆలస్యం అయినా కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని మీడియా తో దర్శకుడు మోహన్ రాజా పేర్కొన్నాడు.
ఇటీవలే ప్రముఖ దర్శకుడితో కలిసి మోహన్ రాజా స్క్రిప్ట్ ను ముగించాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ నెలలోనే సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఆచార్య సినిమా షూటింగ్ మరో రెండు మూడు వారాల షూటింగ్ ను ముగించబోతున్నారు.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా కోసం ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేసిన అభిమానులకు ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమా లు రాబోతున్నాయి.
ప్రస్తుతం సినిమాలు షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి.అయితే ఈ క్రమంలో కొన్ని సినిమాలు అదుగో క్యాన్సిల్ ఇదిగో వాయిదా అంటూ వాస్తలు వస్తున్నాయి.కనుక లూసీఫర్ సినిమా విషయంలో కూడా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని తేలిపోయింది.పుకార్ల పై దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో మరోసారి లూసీఫర్ రీమేక్ కు సంబంధించిన హడావుడి మొదలు అయ్యింది.
చిరంజీవి లూసీఫర్ ను ఎంతో ఇష్టంతో చేసేందుకు సిద్దం అయ్యాడు.కనుక ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు.
కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కబోతుంది.