టాలీవుడ్లో చిన్న సినిమాల దర్శకుడిగా పరిచయమైన మారుతి ఎలాంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కిస్తున్నాడో అందరికీ తెలిసిందే.ఇటీవల మెగా హీరో సాయి ధరమ్ తేజ్కు ప్రతిరోజూ పండగే అంటూ అదిరిపోయే సక్సెస్ఫుల్ చిత్రాన్ని అందించాడు.
పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడంలో తేజు చాలా రోజుల తరువాత మంచి హిట్ అందుకున్నాడు.
ఇక మారుతి తన నెక్ట్స్ మూవీని లైన్లో పెడుతున్నాడనే వార్త తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఓ తెలుగు నిర్మాత కొడుకును మారుతి ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడని, దీని కోసం ఓ పవర్ఫుల్ కథను రెడీ చేశాడని ఓ వార్తి వినిపిస్తోంది.ఇక రీసెంట్గా మెగా ఫ్యామిలీలోని ఓ హీరో కోసం కూడా మారుతి కథ రాస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై తాజాగా మారుతి స్పందించాడు.
తాను ప్రస్తుతం కథను రెడీ చేసే పనిలోనే నిమగ్నమై ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు.
అటు తనపట్ల ప్రేమను చూపిస్తున్న ఫ్యాన్స్, మీడియా వారికి ధన్యవాదాలను కూడా తెలిపాడు.మొత్తానికి గాలి వార్తలకు మారుతి చెక్ పెట్టాడని చెప్పాలి.