చిన్న చిత్రాలతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి కెరియర్ ఆరంభంలో అడల్ట్ కంటెంట్ కథలతో హిట్స్ కొట్టిన దర్శకుడు మారుతి.ఇక తరువాత మారుతి తన జోనర్ ని మార్చుకొని కామెడీని మెయిన్ ఎలిమెంట్ గా తీసుకొని సినిమాలని తెరకెక్కించాడు.
ఈ జోనర్ లో భలే భలే మగాడివోయ్ రూపంలో మారుతికి ఫస్ట్ సూపర్ హిట్ వచ్చింది.ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస హిట్స్ కొట్టాడు.
ఇక తాజాగా సాయి ధరమ్ తేజ్ తో పండగ చేస్కో అని ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.ఇక ఈ సినిమా తర్వాత మారుతి ఎవరితో సినిమా చేస్తాడు అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది.
నిర్మాత డివివి దానయ్య కొడుకుని హీరోగా పరిచయం చేసే బాద్యతని అతను మారుతి చేతిలో పెట్టాడు.అయితే మారుతి ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి ఇప్పుడు మాస్ మహారాజ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.అయితే ఈ టైం ని తాను వాడుకోవాలని మంచి కంటెంట్ తో రవితేజని లాక్ చేయాలని మారుతి భావిస్తున్నట్లు తెలుస్తుంది.రవితేజ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అతనిలో పూర్తి స్థాయిలో కామెడీని ఈ మధ్య కాలంలో పెద్దగా ఆశ్వాదించలేకపోయాం.ఈ నేపధ్యంలో రవితేజగా మంచి కామెడీ ఎలిమెంట్ తో ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కించి పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోవాలని మారుతి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
మరి అది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది చూడాలి.