ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ వరుస హిట్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న టాలెంటెడ్ దర్శకుడు మారుతి.లో బడ్జెట్ బోల్డ్ యూత్ బేస్ అడల్ట్ కంటెంట్ కథలతో సినిమాలు చేసి కెరియర్ ప్రారంభించిన మారుతి తరువాత ఆ జోనర్ ని పక్కన పెట్టి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకున్నారు.
ఈ జోనర్ లో భలే భలే మగాడివోయ్ సినిమా నుంచి వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.అయితే అతని కథలు అన్ని కూడా మీడియం రేంజ్ హీరోలకి మాత్రమే సెట్ అయ్యేలా ఉండటంతో పెద్ద స్టార్స్ తో చేసే అవకాశం రావడం లేదు.
మారుతి చివరిగా సాయి తేజ్ తో ప్రతి రోజు పండగే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.ఈ సినిమా హిట్ అయిన నెక్స్ట్ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకొని ప్రస్తుతం గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మారుతి తన నెక్స్ట్ సినిమా కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఈ నేపధ్యంలో మీడియం రేంజ్, పెద్ద హీరోలు అందరూ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.ఈ నేపధ్యంలో యంగ్ హీరో కార్తికేయకి రీసెంట్ గా ఓ ఎంటర్టైన్మెంట్ కథని వినిపించి ఒకే చేయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇది కూడా తనకి అలవాటైన జోనర్ లోనే ఆవిష్కరించే పనిలో ఉన్నట్లు బోగట్టా.ప్రస్తుతం గోపీచంద్ తో చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమా పూర్తికాగానే గ్యాప్ లేకుండా కార్తికేయ ప్రాజెక్ట్ ని తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.