చిన్న సినిమాల దర్శకుడిగా మారుతి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.యూత్ఫుల్ చిత్రాలను తెరకెక్కిస్తూ వాటిని బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్తో సక్సెస్ఫుల్ చిత్రాలుగా మారుస్తూ ఇండస్ట్రీతలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు.
ఇక ఈ డైరెక్టర్తో సినిమా చేయాలని యంగ్ హీరోలు మొదలుకొని స్టార్ హీరోల వరకు ఎదురుచూస్తున్నారు.కాగా మారుతి తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్, ప్రతి రోజు పండగే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకున్నాయో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలు కేవలం సూపర్ హిట్లుగా నిలవడమే కాకుండా వసూళ్ల పరంగానూ అదిరిపోయే కలెక్షన్లు రాబట్టాయి.నాని, సాయి ధరమ్ తేజ్లకు అదిరిపోయే సక్సెస్ను ఈ సినిమాలు తెచ్చిపెట్టాయి.
ఇక ఇప్పుడు మారుతి తన నెక్ట్స్ చిత్రాలను తెరకెక్కించే పనిలో పడ్డాడు.అయితే మాస్ రాజా రవితేజ, యంగ్ హీరో రామ్ పోతినేనిలతో తన నెక్ట్స్ చిత్రాలను తెరకెక్కించాలని చూసిన మారుతి, ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు మారుతి ప్రయత్నాలు మొదలుపెట్టాడట.
అయితే ఈ సినిమాల్లో నటించే హీరోలను ఎంపిక చేసుకున్న తరువాత ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు మారుతి సిద్ధమయ్యాడు.
ఈ రీమేక్ల గురించిన అన్ని విషయాలను హీరోల ఎంపిక తరువాత తెలుపుతానని మారుతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.దీంతో బాలీవుడ్లో మారుతి చేయబోయే ఈ సినిమాలు స్టార్ హీరోలతోనా లేక యంగ్ హీరోలతోనా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా చిన్న సినిమాలుగా వచ్చిన ఈ చిత్రాలతో బాలీవుడ్లో పెద్ద టెండర్ వేశాడు మారుతి.మరి ఆయన డైరెక్ట్ చేయబోయే ఆ హీరోలు ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.