ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ మరోసారి అందరిని భయపెడుతుంది.ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.
ప్రతి రోజు 50వేలకి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
కరోనా నిబంధనలని కఠినతరం చేశాయి.మరోవైపు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులని సైతం కరోనా వెంటాడుతుంది.
గత ఏడాది ఎస్పీ బాలు లాంటి లెజెండరీ గాయకుడు కరోనాకి బలైపోయారు.అలాగే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా కరోనా కాటుకి బలైపోయారు.
ఈ నేపధ్యంలో కొత్తగా వస్తున్న కరోనా కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు అని వైద్యఆరోగ్య శాఖ కూడా సూచిస్తుంది.తాజాగా క్రికెట్ లెజెండరీ సచిన్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు దక్షిణాది సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు.
సినిమా షూటింగ్ ల కారణంగా వీరు కరోనా బారిన పడటానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది.
తాజాగా మాస్టర్ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్కు కరోనా పాజిటివ్ అని తేలింది.ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు స్టార్ డైరెక్టర్.కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్ష చేయించుకోగా, పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని ఆయన అన్నారు.ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని చెప్పుకొచ్చాడు.త్వరలోనే మళ్లీ మిమ్మల్ని కలుస్తానని లోకేష్ పేర్కొన్నారు.
ఖైదీ, మాస్టర్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి కోలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కమల్ హసన్ తో విక్రమ్ అనే సినిమా చేసే పనిలో ఉన్నారు.