సినీ ఇండస్ట్రీలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సూపర్ స్టార్ రజినీకాంత్.ఈయన ఎన్నో మంచి అద్భుతమైన సినిమాలు తీశాడు.
ఈయన సినిమాలలోడైలాగ్స్, పంచులు వల్ల ఈయనకు అభిమానులను విపరీతంగా పెరిగిపోయారు.ఇక ఈ మధ్య రజినీకాంత్ సినిమాలు తీయడం లేదు.
చాలా గ్యాప్ తీసుకున్నాడు.సూపర్ స్టార్ తో సినిమా తీస్తానంటున్న దర్శకుడు.
దీని గురించి తెలుసుకుందాం.
సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ ఎప్పుడు సినిమాలు తీస్తున్నారని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా తీయడానికి దర్శకుడు కె ఎస్ రవికుమార్ సిద్ధంగా ఉన్నాడు.రవికుమార్ ఆరు నెలల క్రితమే రజినీకాంత్ ఒక కథను వినిపించగా అది నచ్చి, సినిమా చేద్దామని తెలిపారు.
ఇక ఈ విషయం గురించే విలేకరులు రవికుమార్ను ప్రశ్నించగా, రజినీకాంత్ గారికి సినిమా కథను వినిపించాను.అయితే ఆయన దగ్గర నుంచి పిలుపు రాలేదు.వస్తే ఖచ్చితంగా ఓ సినిమా చేస్తానని తెలిపారు.
రవికుమార్ దర్శకత్వం వహించిన పలు సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయి అని ప్రచారం జోరుగా సాగుతోందని అన్నారు.కానీ పంచతంత్రం మాత్రం రెండో భాగం చేయాలి అని తనకుందన్నాడు రవికుమార్.ఇప్పటికే నిర్మాణ సంస్థలో పలువురు దర్శకులు అవకాశాలు ఇస్తానని చెప్పారు.
ఇప్పటివరకూ రవికుమార్ అలా 47 సినిమాలకు దర్శకత్వం వహించానని, మరో మూడు సినిమాలు తీయాలి అన్నది తన కోరిక అని చెప్పారు.
ఈ సినిమాలను తీస్తే తన సొంత బ్యానర్ పై చేయనని ఎవరైనా నిర్మాతలు ముందుకు వస్తే మాత్రం దర్శకత్వం వహిస్తానని తెలిపారు.
ఇప్పుడు రవికుమార్ దర్శకుడిగా కంటే నటుడిగా బాగా బిజీ అయినట్లు తెలిపారు.మలయాళంలో సూపర్ హిట్ అయినా ఆండ్రాయిడ్ కుంజ్జప్పన్ సినిమాను తమిళంలోకి ఆయన రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమాలో దర్శన్ శ్రీలంక యువతి లాస్లియా హీరోహీరోయిన్లుగా వెండితెరకు పరిచయం కానున్నాడు.అయితే ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం గురువారం చెన్నైలోని హోటల్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో కె ఎస్ రవికుమార్ పై వ్యాఖ్యలు చేశారు.