సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ నేటి తరం హీరోలకు పోటీగా వరుస సినిమాలను లైన్ లో పెట్టి నిరంతరం షూటింగ్ లను జరుపుకుంటూ శరవేగంగా సినిమాలను పూర్తి చేస్తున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” సినిమాలో నటిస్తున్నారు.
దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు.
ఇదిలా ఉండగా బాలకృష్ణ అఖండ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.
అలాగే బాలకృష్ణ చేయాల్సిన ఒక సినిమా కథను డైరెక్టర్ బాలకృష్ణతో కాకుండా ఎన్టీఆర్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఎన్టీఆర్ హీరోగా “రాఖీ” చిత్రానికి దర్శకత్వం వహించిన కృష్ణవంశీ.
కృష్ణ వంశీ బాలకృష్ణ హీరోగా రైతు అనే కథను సిద్ధం చేసుకున్నారు.అయితే ఈ సినిమా బాలకృష్ణ కన్నా ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా సరిపోతుందని భావించిన కృష్ణవంశీ ఈ సినిమాను బాలకృష్ణ తో కాకుండా ఎన్టీఆర్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం కృష్ణవంశీ మరాఠీ సినిమాకు రీమేక్ గా వస్తున్న “రంగమార్తాండ” అనే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీలో ప్రకాష్ రాజ్ – రమ్యకృష్ణ జంటగా నటిస్తున్నారు.ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ తో రైతు అనే సినిమాను తిరకేక్కించాలని భావిస్తున్నారు.అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటారో లేదో వేచి చూడాలి.