టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ సినిమా ప్రత్యేకమని చెప్పాలి.ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉండటంతో పాటు కొన్ని సన్నివేశాలకు ఎన్టీఆర్ ప్రాణం పోశారని చెప్పాలి.
బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అబవ్ యావరేజ్ గా నిలిచినప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా తారక్ ను నటుడిగా మరో మెట్టు ఎత్తులో నిలబెట్టిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదనాన్ని ఆవిష్కరించే దర్శకులలో ఒకరైన కృష్ణవంశీ ఈ మధ్య కాలంలో డైరెక్షన్ చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.తాజాగా ఒక నెటిజన్ రాఖీ మూవీ పాన్ ఇండియా మూవీ అని రాఖీ 2.0 తీయాలని కృష్ణవంశీకి సోషల్ మీడియాలో సూచనలు చేశారు.అయితే ఆ సూచనకు స్పందించిన కృష్ణవంశీకి రాఖీ మూవీలో సమాధుల దగ్గర తెరకెక్కించిన సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు.
సమాధి దగ్గర చేసిన సీన్ తనకు ఇష్టమైన సీన్ అని ఆ సీన్ షూటింగ్ జరిపే సమయంలో తనకు నరాలు కట్ అవుతున్నట్టు అనిపించిందని కృష్ణవంశీ ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.ఆ సీన్ షూటింగ్ సమయంలో తాను లోపల ఏడుస్తూ షూట్ చేశానని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.రాఖీ సినిమాలోని పాత్ర కోసం తారక్ ప్రాణం పోశారని ఆ సినిమా గురించి గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పారు.
అయితే రాఖీ 2.0 చేసే ఆలోచన ఉందో లేదో మాత్రం కృష్ణవంశీ స్పష్టత ఇవ్వలేదు.పాన్ ఇండియా మూవీలలో నటిస్తున్న ఎన్టీఆర్ రాఖీ 2.0ను పాన్ ఇండియా కథగా కృష్ణవంశీ తయారు చేస్తే మాత్రం ఆ సినిమాలో నటించడానికి అంగీకారం చెప్పే అవకాశాలు ఉంటాయి.ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు.