దర్శకుడిగా కెరీర్ ఆరంభంలో క్రియేటివ్ డైరెక్టర్ బిరుధును దక్కించుకున్న కృష్ణవంశీ ఆ తర్వాత తర్వాత కాలంలో చెత్త సినిమాలు చేసి ఆ పేరును కాస్త తగ్గించుకుంటూ వస్తున్నాడు.సినిమాలు చేయడం మానేశాడా అనిపించేంత స్లోగా సినిమాలను కృష్ణవంశీ తీస్తున్నాడు.
ఈయన ప్రస్తుతం రంగమార్తాండ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
దాదాపుగా మూడు సంవత్సరాలకు పైగా ఈ సినిమా చిత్రీకరణ కొనసాగిస్తున్నాడు.సోషల్ మీడియాలో ఈ సినిమా విశేషాలు కంటిన్యూస్ గా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాని కృష్ణవంశీ మాత్రం ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అప్డేట్ ను లీక్ కాకుండా చూసుకున్నాడు.
ఎట్టకేలకు సినిమా షూటింగ్ ముగించాము అంటూ ఆయనే స్వయంగా పోస్ట్ పెట్టాడు.
సోషల్ మీడియాలో ఆయన రంగమార్తాండ సినిమా షూటింగ్ ను ఎట్టకేలకు ముగించాను అంటూ ప్రకటించాడు.రంగమార్తాండ సినిమా చిత్రీకరణ కోసం మూడు సంవత్సరాలకు పైగా తీసుకున్న దర్శకుడు కృష్ణవంశీ సినిమాను ఏ స్థాయిలో చెక్కాడా అంటూ అంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
బాక్సాఫీస్ వద్దకు ఈ సినిమాను ఎప్పుడు తీసుకు వస్తారా అనేది చూడాలి.
కరోనా కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా ను వచ్చే ఏడాది వరకు విడుదల చేయకుండానే వేచి చూసే అవకాశాలు ఉన్నాయి.ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అయ్యింది.ఈ కాస్త ఆలస్యం పెద్ద సమస్య ఏమీ కాదు.
కనుక వచ్చే ఏడాది వరకు ఈ సినిమా కోసం వెయిట్ చేయాల్సింది.మూడు ఏళ్ల పాటు ఊరించిన ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.