ఘాజీ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సంకల్ప్ రెడ్డి తన రెండవ సినిమాగా అంతరిక్షం మూవీని పట్టాలెక్కిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అంతరిక్షం మూవీ విడుదలకు సిద్దం అయ్యింది.
వచ్చే వారంలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.ఇక ఈ చిత్రం విడుదల సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు.
సినిమా విడుదల కోసం ఒక వైపు ఏర్పాట్లు చేస్తూనే మరో వైపు ఈ చిత్రం సీక్వెల్ను కూడా ప్లాన్ చేస్తున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సీక్వెల్కు కథ సిద్దం అయ్యిందని, ఆ కథకు క్రిష్ బాగా ఇంప్రెస్ అయ్యి దాన్ని కూడా తమ బ్యానర్లోనే నిర్మించాలని ఫిక్స్ అయ్యారు.సహజంగా సినిమాలు సూపర్ హిట్ అయితే సీక్వెల్ గురించిన ఆలోచన ఉంటుంది.
కాని అంతరిక్షం విడుదలకు ముందే సీక్వెల్ గురించి చర్చించుకోవడం, కథ ఓకే చేయడం వంటివి చూస్తుంటే అంతరిక్షంపై చిత్ర యూనిట్ సభ్యులకు ఏ స్థాయిలో నమ్మకం ఉందో తెలుస్తోంది.
ఘాజీ వంటి ఒక విభిన్నమైన సినిమాను తీసిన సంకల్ప్ రెడ్డి అంతకు రెట్టించిన ఉత్సాహంతో అంతరిక్షంను తెరకెక్కించాడు.ఆయన కష్టం ట్రైలర్లో కనిపించింది.అద్బుతమైన విజువల్స్ను దర్శకుడు ఈ చిత్రంలో చూపించబోతున్నాడు.రికార్డు స్థాయిలో ఈ చిత్రం అమ్ముడు పోయింది.పెట్టిన పెట్టుబడితో పాటు అప్పుడే లాభాలు కూడా వచ్చాయని అంటున్నారు.మొదటి స్పేస్ మూవీ అవ్వడంతో బాలీవుడ్లో కూడా అంచనాలు, ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.త్వరలోనే సినిమాకు సంబంధించిన సీక్వెల్ను ప్రకటించే అవకాశం ఉంది.