ప్రస్తుతం దేశంలో ఎక్కడైనా సెలబ్రిటీలలో ఎక్కువగా వినిపించే పేరు అంటే సోనూసూద్ అని చెప్పాలి.బయట జనాలమధ్య, సోషల్ మీడియాలో కూడా సోనూసూద్ పేరునే ప్రముఖంగా చర్చించుకుంటున్నారు.
కరోనా సిచువేషన్ లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ ఏదో వారికి తోచిన విరాళం ప్రభుత్వాలకి ఇచ్చి మా సాయం అయిపోయింది అనిపించుకున్నారు.ప్రజల కష్టాలతో తమకెలాంటి సంబంధం లేదు అన్నట్లు ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
ఇక బాలీవుడ్ లో బడా హీరోలం అని చెప్పుకునే ఖాన్ త్రయం అయితే అసలు ఈ దేశంతోనే తమకు సంబంధం లేదు అన్నట్లు కనీసం విరాళం ఇవ్వడానికి కూడా ముందుకి రాలేదు.వారి సినిమాల బిజీలో వారు ఉన్నారు.
అయితే సినిమాలలో విలన్ వేషాలు వేసుకునే సోనూసూద్ కరోనా కష్టకాలంలో ప్రజలకి నేనున్నా అంటూ ముందుకొచ్చాడు.సెలబ్రిటీ స్టేటస్ పక్కన పెట్టి రోడ్డు మీదకొచ్చి కష్టం అనే ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు.
కరోనాతో పోరాడుతున్న వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో ఒక్కసారిగా సోనూసూద్ ని దేశ ప్రజలందరూ రియల్ హీరో అని కొనియాడుతున్నారు.
అతని కుటుంబం మొత్తానికి కరోనా వచ్చిన భయపడకుండా తగ్గిన వెంటనే మళ్ళీ తన సోషల్ సర్వీస్ మొదలు పెట్టారు.దీంతో అందరూ అతన్ని అభివన కర్ణుడు అంటూ పోలుస్తున్నారు.
ఇక అతని రియల్ హీరో ఇమేజ్ ఇప్పటి వరకు సినిమాలలో విలన్ వేషాలు మాత్రమే వేసిన అతని వేల్యూని పెంచేసింది.హీరో స్థాయికి తీసుకోచ్చేసింది.
దీంతో అతన్ని హీరోగా పెట్టి సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు రెడీ అవుతున్నారు.ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ కూడా సోనూసూద్ కోసం పాన్ ఇండియా కథని సిద్ధం చేసి అతనికి వినిపించడం జరిగిందని తెలుస్తుంది.
ప్రస్తుతం పవన్ తో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా కంప్లీట్ అయ్యాక సోనూసూద్ తోనే సినిమా తెరకెక్కించాలాని క్రిష్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.