గమ్యం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే మంచి టాలెంట్ ఉన్న దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి క్రిష్.రొటీన్ కి భిన్నంగా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న అతి కొద్ది మంది నవతరం తెలుగు దర్శకులలో క్రిష్ కూడా ఒకడు.
అతని టాలెంట్ ఏంటో గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలు చూస్తే తెలుస్తుంది.ఎమోషనల్ ఎలిమెంట్స్ ని హృద్యంగా పండించడంలో క్రిష్ శైలి వేరుగా ఉంటుంది.
అయితే గత ఏడాది క్రిష్ కి ఊహించి విధంగా రెండు ఎదురుదెబ్బలు తగిలి అతని ఇమేజ్ మొత్తం డామేజ్ చేసేసాయి.అందులో ఒకటి బాలీవుడ్ లో కంగనా రనౌత్ తో ప్రతిసాత్మకంగా తెరకెక్కించిన మణికర్ణిక సినిమా.
హిస్టోరికల్ కాన్సెప్ట్ తో ఝాన్సీ రాణి జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ సగంలోనే క్రిష్ వదిలేసి వచ్చేసాడు.
దీనికి ప్రధాన కారణం హీరోయిన్ కంగనాతో గొడవ.
కథలో ఇష్టానుసారంగా వేలు పెట్టి అతని వర్క్ ని డిస్టర్బ్ చేయడంతో ఆ సినిమా వదులుకున్నట్లు తరువాత క్రిష్ చెప్పాడు.అది అతని ఇమేజ్ బాలీవుడ్ లో పూర్తిగా తగ్గించింది.
ఇక అదే టైం లో ప్రాంతంతో చేసిన ఎన్టీఆర్ బయోపిక్ పూర్తిగా క్రిష్ శైలికి విరుద్ధంగా ఉన్న సినిమా కావడం.ఎలాంటి కొత్తదనం లేని స్టొరీ కావడంతో బయోపిక్ రెండు భాగాలు దారుణమైన డిజాస్టర్ అయ్యాయి.
దీంతో క్రిష్ కి ఊహించని షాక్ లు తలిగాయి.అయితే ఈ షాక్ ల నుంచి తేరుకోవడానికి కొంత గ్యాప్ తీసుకున్న క్రిష్ మళ్ళీ బాలీవుడ్ సినిమా ద్వారానే తన సత్తా చాటాలని ఫిక్స్ అయిపోయి అక్షయ్ కుమార్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది.