స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ టాక్ షో ద్వారా సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో సీక్రెట్లు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.సమంత సామ్ జామ్ షోకు రకుల్, క్రిష్ హాజరు కాగా ఒక విషయంలో బాలకృష్ణ, రకుల్ సేమ్ టు సేమ్ అని క్రిష్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
క్రిష్ బాలయ్య కాంబినేషన్ లో ఇప్పటికే గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు తెరకెక్కాయి.
గౌతమీపుత్ర శాతకర్ణి బాక్సాఫీస్ దగ్గర హిట్ ఫలితాన్ని అందుకోగా ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం క్రిష్ వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా ఒక చిత్రం తెరకెక్కుతోంది.ఈ సినిమా షూటింగ్ పూర్తైన తరువాత పవన్ క్రిష్ కాంబినేషన్ లో ఒక సినిమా ప్రారంభం కానుంది.
క్రిష్ సామ్ జామ్ షోలో బాలయ్య, రకుల్ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ టైమ్, పంక్చువాలిటీ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు.
ఆరు గంటలకు సెట్లో ఉండాలని చెబితే ఆ సమయానికి ఆయన సెట్లో ఉంటారని అన్నారు.బాలకృష్ణ తర్వాత అలా పంక్చువల్ గా రకుల్ ఉంటుందని టైమ్ కు రకుల్ సెట్లోకి రావడం చూసి ఆశ్చర్యపోయానని అన్నారు.రకుల్ డిసిప్లేన్ తో పాటు డెడికేషన్ ఉన్న హీరోయిన్ అని క్రిష్ తెలిపారు.
కరోనా సమయంలో కొండపొలం నవలను సినిమాగా తెరకెక్కించాలని అనుకున్నానని రకుల్ ఈ సినిమాలో డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తున్నారని చెప్పారు.
గ్రామీణ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఓబులమ్మ అనే పాత్రలో రకుల్ నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు 45 రోజుల్లో సినిమా తెరకెక్కిస్తానని చెప్పి ఈ సినిమా షూటింగ్ చేశానని సాధారణంగా హీరోలు తమతో చేసే సినిమా కాకుండా మరో సినిమా చేస్తామంటే ఒప్పుకోరని కానీ పవన్ మాత్రం వెంటనే ఒప్పుకున్నారని క్రిష్ అన్నారు.