యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు.అతని సినిమాల వరుస చూస్తూ ఉంటే ఓ ఐదేళ్ళ పాటు ఏ ఒక్క దర్శకుడికి దొరికే ఛాన్స్ కూడా లేదనిపిస్తుంది.
ప్రస్తుతం రాధేశ్యామ్ పూర్తయిన వెంటనే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.తరువాత నాగ్ అశ్విన్, సిద్దార్ద్ ఆనంద్ మూవీస్ ఉన్నాయి.
ఇవన్నీ భారీ ప్రాజెక్ట్ లే.వీటితో ఇండియన్ ఇంటర్నేషనల్ స్టార్ గా ప్రభాస్ మారిపోయిన ఆశ్చర్యం లేదు.ఆ స్థాయి బడ్జెట్ తో అతని సినిమాలు తెరకెక్కుతున్నాయి.ప్రభాస్ సినిమాలలో హాలీవుడ్ స్టార్స్ కూడా భాగం అవుతూ ఉండటంతో సినిమాల స్టాండర్డ్స్ పెరిగిపోతున్నాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.ప్రభాస్ గతంలో కరుణాకరన్ దర్శకత్వంలో డార్లింగ్ అనే మూవీ చేసిన సంగతి తెలిసిందే.
లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది.
ప్రభాస్ కెరియర్ లో క్లాసిక్ హిట్ గా ఈ మూవీ నిలిచింది.
అయితే రీసెంట్ గా కరుణాకరన్ మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథని ప్రభాస్ కి చెప్పాడని టాక్ వినిపిస్తుంది.ఈ కథ ప్రభాస్ కి కూడా నచ్చిందని, ఈ నేపధ్యంలో ఈ పెద్ద సినిమాల మధ్యలో కేవలం తెలుగులో రిఫ్రెష్ కోసం ఈ సినిమాని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని టాక్ చక్కర్లు కొడుతుంది.
అయితే ప్రస్తుతం ప్రభాస్ ఉన్న స్పీడ్ చూస్తూ ఉంటే అతని దృష్టి అంతా పాన్ ఇండియా సినిమాల మీదనే ఉందని తెలుస్తుంది.ఇప్పట్లో మళ్ళీ రీజనల్ సబ్జెక్ట్స్ జోలికి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
ఒక వేళ కరుణాకరన్ తో చేసిన అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో చేయాల్సి ఉంటుంది.అతని మార్కెట్, స్టార్ స్టేటస్ వలన ప్రభాస్ మీద హెవీ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి.వాటిని రీచ్ అవ్వాలంటే ఒక సాదాసీదా ఫ్యామిలీ డ్రామాతో వర్క్ అవుట్ కాదనేది చాలా మంది అభిప్రాయం.మరి కరుణాకరన్, ప్రభాస్ కాంబినేషన్ మూవీ ఎంత వరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది.